Skip to main content

Posts

Showing posts from March, 2021

భాగవతం - భాగం - 4

పరీక్షిత్తు - కలి కధ మరియు పరీక్షిత్తు మరణం                                                          ఈ భాగవతం నాల్గవ భాగంలో పరీక్షిత్తు మహారాజు కలిపైకి విల్లును ఎందుకు ఎక్కు పెట్టాడు?, పరీక్షిత్తు ఏడు రోజుల్లో తక్షకుడి కాటుకు మరణిస్తాడు అని శృంగి ఎందుకు శపించాడు అన్న కధలను చెప్పుకుందాం.                        శ్రీకృష్ణుని మరణం తరువాత భూలోకానికి కలి ప్రవేశించాడు. కుటిలత్వం, హింస, లోభితనం, మోసం లోకం అంతటా విస్తరించసాగాయి. ఈ విషయాలను ధర్మరాజు గమనించాడు. ఇక తాను కూడా భూలోకాన్ని విడిచి వెల్ల వలసిన సమయం వచ్చేసిందని నిర్ణయానికి వచ్చేసాడు. దానితో తమ ఏకైక వారసుడు అభిమన్యుని కుమారుడు పరిక్షిత్తును హస్తినాపురం చక్రవర్తిగా అభిషేకించాడు. అనిరుద్ధుడి కుమారుడు అజుడు అను వాడిని మధురా నగరానికి రాజుని చేసాడు. తరువాత ఇల్లుని రాజ్యాన్ని వదిలి ఉత్తరం వైపుకు పిచ్చిపట్టిన వాడిలా నడుస్తూ వెళ్ళాడు. భీమ, అ...

భాగవతం - భాగం - 3

  శుక మహర్షి మరియు పరీక్షిత్తు జన్మ రహస్యం                               భాగవతం  మూడవ భాగములో వ్యాస మహర్షి కుమారుడైన శుక మహర్షి జన్మ రహస్యాన్ని, ఈ శుక మహర్షి  భాగవతాన్ని  చెప్పడానికి గల కారణమైన పరీక్షిత్తు మహారాజు జన్మ రహస్యాన్ని గురించి తెలుసుకుందాము.                       నైమిశారణ్యంలో శవనకుడు అను ముని పన్నెండు ఏళ్లు జరుగు సత్రయాగం చేస్తూ వున్నాడు. అక్కడ వేలాదిగా మునులు యజ్ఞములో పాల్గొంటు ఉన్నారు. అటువంటి ప్రదేశంలో సూతుడు అను ఒక గొప్ప కధకుడు వారికి భగవంతుడి గురించి కథలను వినిపిస్తూ ఉన్నాడు. అక్కడి మునుల కోరికఫై  భాగవతాన్ని  వినిపిస్తూ ఉన్నాడు. ముందుగా భాగవతాన్ని మొట్ట మొదటిసారి భూమిపై చెప్పిన శ్రీ శుక మహర్షి జన్మ రహస్యాన్ని చెప్పటం ప్రారంభించాడు. ఒకానొక సమయంలో వ్యాస మహర్షి  మేరు పర్వత శిఖరం పైకి వెళ్లి అక్కడ మహాశివుని కోసం ఘోర తపస్సు చేసాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏమికావాలో కోరుకోమనగా పంచభూతాలకు సమా...

భాగవతం - భాగం - 2

విష్ణుమూర్తి అవతారాలు - సృష్టి పరిణామ క్రమ వివరణ                                    భగవంతుడి అవతారాలకు భూమిపై సృష్టికి గల అవినాభావసంబంధం గురించి తెలుసుకుందాం. ఈ భూమి మీద మానవ జననం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసారు. భూమి మొదట ఒక అగ్నిగోళంలా ఉండేది. కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచాక చల్లబడింది. ఆ తరువాత ఎడతెరిపి లేకుండా లక్షల ఏళ్ళు వర్షాలు కురిసి సముద్రాల, నదులు ఏర్పడ్డాయి.                 ఆలా  సముద్రాల, నదుల నుండి ఏర్పడిన తేమ జీవి పుట్టుకకు కారణం అయ్యింది. మొదట కర్బన సేంద్రీయ  పదార్థం ఏర్పడింది. అది ఏకకణ జీవిగా మారింది. ఆ ఏకకణ జీవి కాలక్రమేణా బహుకణ జీవిగా మారింది. ఆ తరువాత కొన్ని లక్షల సంవత్సరాల తరువాత నీటిలో జీవించే జలచరాలు ఎన్నో పుట్టుకువచ్చాయి. వాటి అన్నింటి స్పష్టమైన రూపంగా చివరికి చేప పుట్టింది. ఈ చేప మహావిష్ణువు మొదటి అవతారం అయినా మశ్చ్యావతారం. ఆ తరువాత జలచరం నేలపైకి రావడానికి ప్రయత్నంచేసింది. అలా కొ...

భాగవతం - భాగం - 1

వ్యాస మహర్షి భాగవత రచనా ప్రారంభము - కారణాలు               భాగవతం - భాగవతం ఒక మహా గ్రంధము. భాగవతం చదవటం లేదా వినటం ద్వార అన్ని పాపాలు తొలిగి పొతాయి.ఈ భాగవతాన్ని తెలుగులో సరళమైన భాషలో చెప్పడానికి చెస్తున్న చిన్న ప్రయత్నం. ఈ భాగవతంలొ శ్రీ మహావిష్ణువు అన్ని అవతారాలు మరియు భాగవతం రాయడానికి గల కారణాలు చెప్పబడతాయి.               అంతులేని దారుణమైన భయానక హింసాకాండ నుండి పుట్టుకువచ్చిన శాంతి, భక్తి సందేశమే భాగవతం. వ్యాస మహర్షి పద్దెనిమిది పర్వాలుగా మహాభారత ఇతిహాస గ్రంధాన్ని రచించాడు. కురుక్షేత్ర రణరంగంలో శవాలు గుట్టలుగా పడి, ద్వేషం పెను మంటగా రగిలి, ప్రతికారజ్వాలలు నింగికి ఎగసి, మహిళల ఏడ్పులు లోకాలన్నీ ద్వనించి ముగిసింది మహాభారతం. ఇంతటి దారుణ మారణకాండ వలన పాండవులు సాధించిందేమిటి, హస్తినాపుర ప్రజలకు దక్కింది ఏమిటి, చివరకు కురువంశం నశించింది, యదుకులం కూడా అంతమైంది, పాండవులు స్వర్గారోహణ చేసారు. కురుక్షేత్రంలో జరిగిన హింస తెలియచేయటం ద్వారా తాను సాధించినది ఏమిటని ఆవేదనకు, దుఖానికి  గుర...